NDL: ప్యాపిలి మండలం బురుగులలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఆ విరాళాన్ని డోన్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆలయ నిర్వాహకులకు శనివారం అందజేశారు. ఆలయ పునరుద్ధరణకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.