తిరుపతిలో రైల్వే పోలీసుల అప్రమత్తతతో గంజాయి రవాణా ప్రయత్నం విఫలమైంది. డీఎస్పీ మురళీ మార్గదర్శకత్వంలో GRPS, RPF సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేసి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 17 ప్యాకెట్లలో సుమారు 15.460 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 వేలుగా ఉంటుదని వారు అంచనా వేశారు.