»Team India Captain Rohit Sharma Interesting Comments On Players
Hitman: వ్యక్తిగత రికార్డుల కోసం వరల్డ్ కప్ వేదిక కాదు
వ్యక్తిగత రికార్డుల కోసం వరల్డ్ కప్ మ్యాచ్లు వేదిక కాదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డారు. జట్టు విజయం కోసం అందరూ సమిష్టిగా రాణించాలని సూచించారు.
Rohit Sharma Breaks Another Record At World Cup Final Match
Rohit Sharma: వన్డే వరల్ట్ కప్లో (2023) ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనుంది. గిల్ జ్వరం వల్ల మ్యాచ్కు దూరం కానున్నాడు. యువకుడే కాబట్టి.. త్వరగా కోలుకుంటాడని అంటున్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). హార్థిక్ పాండ్యా వల్ల ముగ్గురు స్పిన్నర్లను తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. ముగ్గురు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే జట్టు కరెక్ట్గా ఉంటుందని చెప్పారు. చెన్నై చెపాక్ స్టేడియం పిచ్ స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. అందుకే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని చెబుతున్నాడు.
పాండ్యా బౌలింగ్ చేయడం వల్ల మరో స్పిన్నర్ జట్టులోకి వస్తారని రోహిత్ (Rohit) వివరించారు. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ అందుబాటులో ఉంటారని తెలిపారు. మ్యాచ్కు ముందు పిచ్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఒత్తిడి సమయాల్లో మానసికంగా స్ట్రాంగ్గా ఉంటామని చెప్పారు. కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నానని.. మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉండటం సహజమేనని పేర్కొన్నారు. ప్రతీ మ్యాచ్ ఆడే సమయంలో ఉత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతామని.. పిచ్, వాతావరణ పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని వివరించారు.
పిచ్ మందకొడిగా ఉంటే స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని.. అదనంగా అలాంటి బౌలర్ కావాల్సి ఉంటుందన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు మినహా జట్టుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అన్నారు. రిజర్వ్ బెంచ్కు పరిమితమైన ప్లేయర్ ఆటను తక్కువ చేసినట్టు కాదని రోహిత్ శర్మ స్పష్టంచేశారు. ఎవరికీ వ్యక్తిగత ప్రాధామ్యాలు ఉండకూడదని.. జట్టుగా ఆడి విజేతంగా నిలవాల్సిన మెగా టోర్నీ ఇదీ అన్నారు. టోర్నీలో వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యం ఇవ్వొద్దని స్పస్టంచేశారు. రికార్డులకు మెగా సంగ్రామం వేదిక కాదని తేల్చిచెప్పారు. ఏ చిన్న తప్పు జరిగిన విజయం తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు.