KNR: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద విధుల్లో ఉన్న లస్కర్ తడిగొప్పుల మల్లయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి కాల్వ వద్ద తోటి సిబ్బందితో కలిసి నిద్రించిన ఆయన, తెల్లవారేసరికి విగతజీవిగా కనిపించారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బంధువులు డిమాండ్ చేశారు.