కేరళంలో మరో ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి కలకలం రేపుతోంది. కోళికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎరంజికల్ ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితం ఈ వ్యాధి బారిన పడిన నలుగురిలో ఒక చిన్నారి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.