WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ BRTU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు సంఘ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం వెంటనే స్పందించి హామీ మేరకు వేతనాలు చెల్లించి ఆశా వర్కర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.