ASR: భూమి మనుగడకు అడవులు అవసరమని అరకు ఎఫ్ఆర్వో కోటేశ్వరరావు అన్నారు. శనివారం ప్రపంచ అటవీ దినోత్సవం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో భాగంగా అరకులోయ అటవి శాఖ కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. అడవుల ప్రాముఖ్యత, పరిరక్షణ, జీవవైవిధ్యంపై అవగాహన కల్పించడమే ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.