KRNL: ఈనెల 28న వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS నాయకులు పిలుపునిచ్చారు. ఆదోనిలో జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరుగుతుందని శనివారం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని పేర్కొన్నారు.