ADB: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం ఉట్నూర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రపంచ శాంతికి ప్రతిరూపమని ఆయన కొనియాడారు. అందరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.