BDK: లక్ష్మీదేవిపల్లి మండలంలో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురుగాలుల మొక్కజొన్న పంటలు దెబ్బతిని రైతులు నష్టపోవడం జరిగిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న రైతులకు తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని శనివారం డిమాండ్ చేశారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు నేడు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.