కోనసీమ: మలికిపురం(మం) శంకరగుప్తంలో ఉన్న శ్రీ మదన గోపాల స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. దేవాలయాల కీర్తి ప్రతిష్టలను కాపాడుతూ, వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు పాలకవర్గాలు కృషి చేయాలని సూచించారు.