KKD: పెద్దాపురం పట్టణంలో ఈదుల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. శనివారం పట్టణ శివారు కట్టమూరు పుంతలో ఉన్న చారిత్రాత్మక ఈద్గా మెట్టపై ముస్లింలు భారీ సంఖ్యలో తరలి వచ్చి సామూహిక పండుగ నమాజ్ ఆచరించారు. షాహీ జామియా మస్జీద్ ఇమామ్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు నిర్వహించారు.