CTR: నగరి ప్రాంతానికి చెందిన మూసా బాయ్ నివాసంలో మాజీ మంత్రి రోజా శనివారం రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకున్న ఆమె, అందరికీ హృదయపూర్వక ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం పవిత్రత మనిషిలో సహనం, దాతృత్వం, క్షమా వంటి విలువలను పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు.