KKD: ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని రుడా చైర్మన్, జిల్లా TDP ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. శనివారం రాజానగరం TDP కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.