KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్దకు భారీగా తరలివచ్చి సామూహిక నమాజ్ నిర్వహించారు. రంజాన్ పవిత్రతను, పేదలకు చేసే దానధర్మాల (జకాత్) ప్రాముఖ్యతను మత పెద్దలు వివరించారు.