VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామాల అభివృద్ధికి అధికార యంత్రాంగం సహకరించాలన్నారు. అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచ్ లు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు.