E.G: వైసీపీ ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ గౌరవాన్ని కాలరాసారనీ విమర్శించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అగౌరవపర్చారనీ పేర్కొన్నారు. ఈ అపచారానికి జగన్ లెంపలు వేసుకోవాలన్నారు.