NGKL: ఉప్పునుంతలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రగతి ప్రణాళిక ఆరోగ్య మిషన్-99 రోజులు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారీ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఆరుగురు స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా మాతా-శిశు సంరక్షణ, కిషోర బాలికల ఆరోగ్యం, వయోవృద్ధుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.