NZB: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ పై RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చలేకపోయిందన్నారు. రైతులు, కార్మికులు, పేదలు, సామాజిక వర్గాలకు న్యాయం చేయలేదన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు ₹23,179 కోట్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతులకు సరిపడవన్నారు.