KNR: ప్రజా వ్యతిరేక చట్టాల రద్దుకు ఈనెల 24న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు.