AP: హిందూ ధర్మాన్ని భక్షించే వారే ‘హిందూ ధర్మ రక్ష’ అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమని మంత్రి పార్థసారథి విమర్శించారు. YCP హయాంలో హిందూ సంప్రదాయాలను గౌరవించలేదని తెలిపారు. నెయ్యి కల్తీతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. ఆలయాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే సెట్టింగ్లు వేసి పూజలు చేస్తున్నట్లు నటించడం జగన్కు అలవాటేనని ఎద్దేవా చేశారు.