MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లిలో నిర్వహించే పశువుల సంత వేలంపాటను మళ్ళీ వాయిదా వేశామని గ్రామ సర్పంచ్ మాధవి రవి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వారసంత వేలం పాటను నిర్వహించిన నిర్దేశిత అప్సెట్ ధర రాకపోవడంతో మార్చి 24కు వేలం పాటను వాయిదా వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూపతి, వార్డ్ సభ్యులు ఉన్నారు.