విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో గురువారం నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గోపాలపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో మార్క్, లక్కీ అనే నార్కోటిక్ డాగ్స్ సహాయంతో జరిపిన సోదాల్లో ఒక వ్యక్తి వద్ద రెండు కిలోల గంజాయి లభ్యమైంది. సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని, డాగ్ హ్యాండ్లర్లను సీపీ అభినందించారు.