NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు మరింగంటి లక్ష్మీ నరసింహ చార్యులు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివిధ రాశుల వారి బలాలు, వర్షాలు, వ్యవసాయం, ప్రభుత్వ పరిపాలన, రాజకీయ పార్టీల బలాలు, తదితర విషయాల గురించి తెలియజేశారు.