NLR: కందుకూరులోని కోటారెడ్డి నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. రూ.28.50 లక్షల వ్యయంతో వాటిని నిర్మించినట్లు మున్సిపల్ కమిషనర్ అనూష తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు వీటి నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.