PDPL: భక్తికి రూపం ఉంటే అది ఓదెల మల్లన్న క్షేత్రంలో కనిపిస్తుంది. ఉగాది పర్వదినం వేళ పెద్దపల్లి జిల్లా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా హరిపురం గ్రామ యాదవ కులస్తులు తమ 40 ఏళ్ల నాటి అరుదైన సంప్రదాయాన్ని చాటుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన మేకపోతుల రథంతో భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.