అన్నమయ్య: మదనపల్లిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు, ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం చేసిన పండితులు ఈ సంవత్సరం సుభిక్షం, సస్యశ్యామలం ఉంటుందని తెలిపారు.