MDCL: ఉప్పల్లో ఉగాది పండుగ సందర్భంగా కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాయి. సంప్రదాయాలను గౌరవిస్తూ ఉగాది రోజున నాన్ వెజ్ వంటకాల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. కస్టమర్లకు పచ్చడి, పులిహోర, బొబ్బట్లు వంటి ప్రత్యేక శాకాహార వంటకాలు అందిస్తున్నారు. పండుగ వాతావరణానికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.