NLG: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారని సీపీఎం నేతలు ప్రశంసించారు. గడీలపై దాడులు చేసి ధాన్యాన్ని పేదలకు పంచడం వంటి ధైర్య సాహసాలను కొనియాడారు. చిట్యాలలో గురువారం ఆమె వర్ధంతి కార్యక్రమంలో నేతలు జోహార్లు అర్పించారు.