ఇండియా మాజీ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పేరు క్రికెట్కు పర్యాయపదంగా ఉన్నప్పటికీ, మహేంద్ర సింగ్ ఇతర క్రీడలకు కూడా వీరాభిమాని. ఫుట్బాల్పై అతని అమితమైన ప్రేమ. టీమిండియా సింగ్ ధోనీ ఐపీఎల్ అయిపోయాక విరామ సమయాన్ని తన హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా (New York) లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలను ఆస్వాదిస్తూ ధోనీ కెమెరాల కంటబడ్డాడు. ఈ ఉదయం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి యూఎస్ ఓపెన్ (US Open) లో వరల్డ్ నెంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ (final match) జరిగింది. ఈ మ్యాచ్ కు ధోనీ కూడా హాజరయ్యాడు. అల్కరాజ్(Alcaraz) బెంచ్ కు వెనుకగా కూర్చుకున్న ధోనీని పలుమార్లు టీవీలో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.అయితే, యూఎస్ ఓపెన్ కెమెరామన్లకు ధోనీ ఎవరో తెలియదు కాబట్టి, ధోనీపై కెమెరాలను పెద్దగా ఫోకస్ చేయలేదు. అదే, ఏ క్రికెట్ (Cricket) ఈవెంట్ అయ్యుంటే కెమెరాలన్నీ ధోనీ వైపు తిరిగుండేవి. అభిమానులు ధోనీని గుర్తించి, వీడియో ఫుటేజిలోని క్లిప్పింగ్స్ ను, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సోషల్ మీడియా (Social media) సైట్లలో ఎక్కడ చూసినా యూఎస్ ఓపెన్ లో ధోనీ విజువల్సే కనిపిస్తున్నాయి.