MHBD: ఎలాంటి అనుమతులు లేకుండా పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లను స్థానిక తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.