KMM: న్యాయ సేవల అథారిటీ జిల్లా ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అత్యధిక కేసులను పరిష్కరించడంతో పాటు తక్షణ న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కోర్టు ఆవరణలో బుధవారం న్యాయమూర్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.