KMM: ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేతృత్వంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో సమాంతరంగా సర్వే బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో సరిహద్దులను ఖరారు చేయాలని సూచించారు.