NDL: బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో తలారి వెంకటేశ్వర్లు (17) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం తల్లి ఇంటి నుంచి వెళ్లి, నెల క్రితం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి తల్లితో తరచూ గొడవలు జరిగేవి. ‘నీ వల్ల గ్రామంలో మా పరువు పోయింది’ అంటూ బాధపడుతూ.. ఈ చర్యకు పాల్పడినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు.