జగిత్యాల జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లపై జిల్లా ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధమన్నారు. ఫారం-ఎఫ్ వివరాలను ప్రతినెల సమయానికి సమర్పించాలని, ఆన్లైన్-ఆఫ్లైన్ రికార్డులు ఒకేలా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్షతో పాటు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.