KRNL: కౌతాళం పట్టణంలో బుధవారం ‘రైతన్న మీకోసం వారోత్సవాలు’ మూడో రోజు కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాకేష్ రైతుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.