గద్వాల నల్లకుంట ఉర్దూ భవన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ఉగాది రంజాన్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి మతసామరస్యాన్ని చాటారు.