KMR: కులం పేరుతో దూషించడమే కాకుండా ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలుశిక్షతో పాటు రూ.5,500 జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ (ఎస్సీ, ఎస్టీ కోర్టు) శ్రీనివాస్ బుధవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయ ఒక ప్రకటన విడుదల చేసింది.