AP: విశాఖను దోచుకుతింటున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని.. కూటమి అవినీతిని ప్రజలకు తెలియాజేయాలన్నారు. పార్టీ కోసం నిలబడినవారికి GVMC ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. GVMC ఎన్నికలకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు.