VZM: కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులను భారీగా వంచన చేసిందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస రావు అన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక, కనీస మద్దతు ధర లభించక, మొక్కజొన్న రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన చెందారు. అదే విధంగా జిల్లాలో గ్యాస్ కొరతను ప్రభుత్వం తీర్చాలన్నారు.