MHBD: పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని DSP తిరుపతిరావు సూచించారు. బయ్యారంలో ఏర్పాటుచేసిన పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచనలు చేశారు.