SRCL: ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందించాలని లక్ష్యంతో పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో “నైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని ప్రారంభించారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పోలీస్ స్టేషన్కు వెళ్లడం ఒక భారంగా మారకూడదని ప్రవేశపెట్టామన్నారు.