దేశంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. రేపటి నుంచి వాణిజ్య సిలిండర్లు సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచినట్లు వెల్లడించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డీలర్లకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, యూటీలకు లేఖ రాసింది.