సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రత్యేక అధికారిగా పెనుకొండ ఆర్డీవోను నియమించగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఉత్తర్వులు సవరిస్తూ జిల్లా కలెక్టర్కు బాధ్యతలను చేపట్టాలని ఆదేశించింది.