SDPT: దుబ్బాక మండలం రఘోతంపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.