KNR: కరీంనగర్ నగరంలో వీధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉండాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రధాన రహదారులు, పలు డివిజన్లలో ఆయన పర్యటించి దీపాల వెలుగులను పరిశీలించారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, వెలగని చోట వెంటనే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.