KRNL: ఆదోని వన్డేన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రామకృష్ణను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం సస్పెండ్ చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్డెనియా విల్లాస్లో రాఘవేంద్ర ఇంటి ప్రహరీని పగలగొట్టి, భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.