MLG: మాతా-శిశు మరణాలు ఏ పరిస్థితిలోనైనా సంభవించకూడదని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని DMHO డా. గోపాలరావు అన్నారు. జిల్లా కేంద్రంలో గర్భధారణ సమయంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణపై ఆరోగ్య కార్యకర్తలకు ఇవాళ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించి తల్లి-బిడ్డ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.