ASR: జీ.మాడుగుల మండలం గన్నేరుపుట్టులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన కాఫీ, మిరియాల తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పాంగి సీతన్న, చిన్నమ్మి, భీమన్న, మఠం రాంబాబు అనే రైతులకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఉన్న కాఫీ, మిరియాల తోటల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.