ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగొపోతోంది. ప్రతి ఇండియన్ గర్వించేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్కు అడుగు దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఆస్కార్ పై మరిన్ని ఆశలు రేతకెత్తించింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్కు.. రెండు విభాగాల్లో నామినేషన్స్లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ‘ట్రిపుల్ ఆర్’లోని నాటు నాటు పాటకు గాను.. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందించారు. గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు గాను.. ఎ.ఆర్. రహమాన్ ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ముందు గోల్డెన్ గ్లోబ్ను అందుకున్నారు. ఆ తరువాత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే తీరున కీరవాణి సైతం తప్పకుండా ‘ట్రిపుల్ ఆర్’లోని నాటు నాటు పాటతో ఆస్కార్ కొట్టేయడం ఖాయమంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కీరవాణి ఫోటో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. రెహమన్ కూడా ‘Incredible.. Paradigm shift Congrats Keeravani Garu from all Indians and your fans! Congrats ssrajamouli Garu and the whole RRR team! అంటూ ట్వీట్ చేశాడు. ఇక మన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. రాజమౌళి ప్రసంగిస్తున్న ఫోటో పెట్టి ‘నా హీరో’ అంటూ పోస్ట్ చేశారు. వీళ్లే కాదు ఇండియన్ సినీ ప్రముఖులంతా.. రాజమౌళిపై ప్రశంస